బట్టల షాపులో ఉల్లిగడ్డ ఆఫర్ 


ధర పెగితే ఏదైనా బంగారమే. అపురూపమే. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా అపురూప వస్తువుగా మారింది. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డ రేటు మండిపోతున్న సంగతి తెలిసిందే. కిలో ఉల్లిగడ్డ ఏకంగా రూ. 200వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకి ఉల్లికోసేటప్పుడు కాదు.. కొనేటప్పుడే కన్నీలొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో ఓ బట్టల వ్యాపారి విన్నూతంగా ఆలోచించాడు. తన బట్టల షాపుల ఉల్లిగడ్డ ఆఫర్ పెట్టాడు.

మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్ ప్రాంతంలో ఓ వ్యాపారి ‘శీతల్ హ్యాండ్లూమ్స్’ పేరిట బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఉల్లిగడ్దల ధరలు భారీగా పెరగడంతో.. త‌న‌ బట్టల షాపులో వేయి రూపాయల విలువైన వస్త్రాలని కొనుగోలు చేస్తే 1 కేజీ ఉల్లిపాయలను ఉచితంగా అందిస్తామని ప్రకటించాడు. ఈ ఆఫర్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని సదరు వ్యాపారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ బట్టలు కొనుక్కోవాలి. దానికి ఉల్లిగడ్డలు ఫ్రీగా వస్తుండటంతో.. ‘శీతల్ హ్యాండ్లూమ్స్’ కు ప్రజలు క్యూ కడుతున్నారు.