చెన్నై వన్డే : విండీస్ టార్గెట్ 289

చెన్నై వేదికగా వెస్టీండీస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ (70), రిషబ్ పంత్ (71) పరుగులతో రాణించారు. కె ఎల్ రాహుల్ (6), రోహిత్ శర్మ (36), విరాట్ కోహ్లీ (4) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.

40 ఓవర్లకు 216/5గా టీమిండియా స్కోర్ బోర్డ్ ని 300 దాటేలా కనిపించింది. ఐతే, కేదార్ జాదవ్ (40), జడేజా (21) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో.. ఆఖరుల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది. విండీస్  కాంట్రేల్, కిమో పాల్, జోసఫ్ తలో రెండు వికెట్లు తీశారు. పోలార్డ్ ఒక వికెట్ పడగొట్టాడు.