దుబాయ్’లో మోసాలకి పాల్పడిన టాలీవుడ్ హీరో అరెస్ట్

దుబాయ్ లో మోసాలకి పాల్పడిన టాలీవుడ్ హీరోని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఎవడ్రా హీరో’ అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్ దుబాయ్ లోని ఎస్ బీకే గ్రూప్ పేరుతో వ్యాపారం చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాల పేరుతో డబ్బు వసూలు చేసినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి.

ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.దుబాయ్ దౌత్య కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాద్ పోలీసులు.. హీరో రషీద్ ని అరెస్ట్ చేశారు. గతంలోనూ మోసాలకి పాల్పడిన నటీనటులు, దర్శక, నిర్మాతల ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఓ హీరోనే మోసాలకి పాల్పడం అనేది బహుశా.. ఇదే తొలిసారియేమో.. !