చెన్నై వన్డేలో విండీస్ గెలుపు

వన్డే  సిరీస్ లో వెస్టీండీస్ బోణి కొట్టేంది. చెన్నై వేదిక జరిగిన తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాని చిత్తు చేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు అయ్యర్ (70), పంత్ (71) రాణించారు.

అనంతరం 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ దాటిగా ఆటని మొదలెట్టింది. విండీస్ యువ బ్యాట్స్‌మెన్ హెట్‌మైర్ సెంచరీ (139, 106బంతుల్లో. 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఆయనకి తోడుగా ఓపెనర్ షై హోప్ (102, 152బంతుల్లో, 7ఫోర్లు, 1సిక్సి) బాధ్యతగా ఆడాడు. దీంతో 47.5 ఓవర్స్ లోనే విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో.. మూడు వన్ డే సిరీస్ ఓ విండీస్ 1-0ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.