మెగా ‘సైరా’న్ మ్రోగింది

మెగా ‘సైరా’న్ మ్రోగింది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ సెట్స్ మీదకు వెళ్లింది. హైద‌రాబాద్ ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యింది. ఫస్ట్ డే ఫైట్ మాస్ట‌ర్ లీ విట్టేక‌ర్ సార‌థ్యంలో కీల‌క యాక్ష‌న్ సన్నివేశాలను తెరకెక్కించారు. తొలి సన్నివేశాన్ని చిరంజీవి, బ్రహ్మాజీలపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 22 వరకు కొనసాగనుంది.

దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో ‘సైరా..’ తెరకెక్కనుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార జతకట్టనుంది. అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు లు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం. రామ్ చరణ్ నిర్మాత.