యాదాద్రిలో సీఎం కేసీఆర్ పూజలు

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొద్దిసేపట్లో యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించి మహా సుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని గుర్తిస్తారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. శిల్పులు తుదిమెరుగులు దిద్దుతున్న పనులను ప్రత్యక్షంగా సీఎం వీక్షించనున్నారు. కొండకింద ప్రెసిడెన్షియల్ సూట్ పనులు, పెద్దగుట్టపై చేపట్టాల్సిన పనులపైనా సీఎం అధికారులకి తగిన సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.