సరిలేరు ట్రైలర్’కు ముహూర్తం ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ని ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ని వదిలారు. దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ప్రతి సోమవారం ఓ పాటని వదులుతున్నారు.

ఇక జనవరి 5న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఐతే, ఈలోపే ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఈ నెల 25న సరిలేరు ట్రైలర్ ని వదలనున్నారు. అదే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 5న మరో ట్రైలర్ లేదంటే స్పెషల్ వీడియా ఒకటి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.