అలీకి మాతృవియోగం

ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ప్రస్తుతం అలీ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు హుటాహుటీన బయల్దేరారు. మరోవైపు జైతున్‌ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు.  అలీ వివిధ సందర్భాల్లో తల్లి మీద తనకున్న ప్రేమని గుర్తు చేసుకునేవారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తల్లితండ్రులే కారణమని చెప్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.