ఆ.. మత్తులో రాశీఖన్నా !

ముద్దుగుమ్మ రాశీఖన్నా మత్తులో మునిగిపోయింది. దాన్నుంచి ఇప్పట్లో బయటికి వచ్చేలా కనబడటం లేదు. ఆమెని హిట్టు మత్తు ముంచేసింది. అవునూ.. వారం గ్యాప్ లోనే రెండు హిట్లు. గతవారం (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వెంకీమామ’ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

వారం తిరిగేసరికి పాతికకోట్ల షేర్ ని రాబట్టింది. మామ-అల్లుళ్ల సందడిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. వీరి సందడి సంక్రాంతి పండగ వరకు కొనసాగేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెంకీమామలో నాగచైతన్యకి జంటగా నటించింది రాశీఖన్నా. ఆమె నటనకి, అందానికి మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఇవాళ (డిసెంబర్ 20) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. పండగ థియేటర్స్ లో నవ్వులే నవ్వులు అని చెబుతున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో వినోదం, ఎమోషన్స్ బాగా పండాయ్. బోమ్మ హిట్టు అని చెబుతున్నారు. ఇందులో టిక్ టాక్ క్వీన్ గా రాశీఖన్నా యూత్ ని ఆకట్టుకుంటోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారం గ్యాప్ లో రాశీ ఖాతాలో బ్యాట్ టు బ్యాక్ హిట్స్ పడినట్టయింది.