సూపర్ స్టార్ కోసం మెగాస్టార్ వస్తున్నారు

వచ్చే యేడాది సూపర్ స్టార్ మహేబాబు మెగా హీరో, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ఢీకొనబోతున్నారు. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా, మహేష్ అభిమానుల మధ్య ఫైట్ అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. ఫైట్ అభిమానుల మధ్యే.. స్టార్స్ మధ్య కాదని సరిలేరు చిత్రబృందం నిరూపించింది.

అవునూ.. వచ్చే యేడాది జనవరి 5న హైదరాబాద్ ఎల్భీనర్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సరిలేరు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు.. మహేశ్ పర్సనల్ మెగాస్టార్ కి కృతజ్ఝతలు చెబుతూ ట్విట్ కూడా చేశారు. సంక్రాంతి సినిమాలు అల.., సరిలేరు మధ్య భీకర పోరు ఉండనుందని అనే ప్రచారం నేపథ్యంలో సరిలేరు ప్రీ రిలీజ్ కి మెగాస్టార్ రావడంతో.. అభిమానులకి మంచి మెసేజ్ పంపినట్టు అవుతుంది. 

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. రష్మిక మందన కథానాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు.