మనోళ్లు మస్త్’గా ఎంజాయ్ చేశారుగా !


భారత్-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ రజుంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియాపై విండీస్ 8 వికెట్లతో గెలుపొందింది. ఇక రెండో వన్ డే లో సీన్ రివర్స్ అయింది. ఈ సారి భారత్ ని ఘన విజయం వరించింది. వైజాగ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగులతో అద్భుత విజయం నమోదు చేసింది. సిరీస్‌ సమం కావడంతో ఆదివారం కటక్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

టీమిండియా, వెస్టిండీస్‌ జట్లు గురువారం భువనేశ్వర్‌ చేరుకున్నాయి. మూడో వన్డేకు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు సేదతీరేందుకు జట్టు యాజమాన్యం అనుమతించింది. దీంతో కోహ్లీ అండ్‌ బాయ్స్‌ ఈరోజు సరదాగా గడుపుతున్నారు. దానికి సంబంధించి.. కోహ్లీ ట్విటర్‌లో రెండు ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ‘డే ఆఫ్‌ రోజు మధ్యాహ్న వేళ సహచరులతో సరదాగా ఆస్వాదించడమే మాకు కావాల్సింది’ అని కెప్టెన్‌ ట్వీట్‌ చేశాడు.