ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 9మంది మృతి !

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని కిలారి ప్రాంతంలోని ఒక వస్త్ర గోడౌన్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 9మంది మృతి చెందారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. గత రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ నెల 8న అనాజ్‌మండి ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.