వైరల్ : మెగాస్టార్’తో మహేష్ ముచ్చట్లు

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు. ముచ్చట్లో మునిగిపోయారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ కలిశారు ? ఎప్పుడు కలిశారు ?? అనే వివరాలేవీ తెలియరాలేదు. కానీ, ఈ మెగా సూపర్ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక జనవరి 5న హైదరాబాద్ ఎల్భీ స్టేడియంలో జరగనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి చిరు ఇంటికి వెళ్లి సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆహ్వానించారు. అందుకు చిరు వెంటనే అంగీకరించారు. అందుకు మహేష్ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ కి కృతజ్ఝతలు తెలిపిన సంగతి తెలిసిందే.

సరిలేరు చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు-అనిల్ సుంకర-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.