దిశగా సమంత.. స్క్రిప్ట్ రెడీ !

దిశ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వెటర్నరీ డాక్టర్ దిశని నలుగురు క్రూరులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులని వారం తెరగకుండానే తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ పై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇక దిశ ఘటన నేపథ్యంలో సినిమా చేసేందుకు తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ తదనంతర పరిణామాలపై స్క్రిప్ట్ రెడీ చేసుకుని సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఇందులో స‌మంత‌ని ప్ర‌ధాన పాత్ర‌కి ఎంపిక చేసిన‌ట్టు సమాచారమ్. స్క్రిప్ట్ రెడీ చేసే ముందే స‌మంత‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టాడ‌ట ఈ త‌మిళ ద‌ర్శ‌కుడు. ఫైనల్ స్కిప్ట్ విన్నాక సమంత తుది నిర్ణయాన్ని తెలియజేయనుంది. నిజంగానే దిశగా సమంత నటిస్తే.. ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ దక్కడం ఖాయం.