నితిన్-రానా-రోహిత్ సెట్టయ్యారు

టాలీవుడ్’లో మల్టీస్టారర్ సినిమాలు క్యూ కట్టబోతున్నట్టు కనబడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్-ఎన్టీఆర్’ల మల్టీస్టారర్’ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది. యువ దర్శకులు కూడా మల్టీస్టారర్ కథలు రెడీ చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ్-నాని, నితిన్-శర్వానంద్ మల్టీస్టారర్స్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు మరో మల్టీస్టారర్ సినిమా తెరపై వచ్చింది.

‘గరుడవేగ’ సినిమా తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు నితిన్ హీరోగా ఓ సినిమాని ప్లాన్ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా మల్టీస్టారర్ అని తేలింది. ఇందులో హీరో పాత్రలకు తగ్గట్టుగా మరో రెండు పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రల కోసం ప్రవీణ్ సత్తారు యంగ్ హీరోలు రానా దగ్గుపాటి, రోహిత్ నారాలని సంప్రదించినట్టు తెలుస్తోంది. వీరు ఒకే చెబితే.. ఈ మల్టీస్టారర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.