లైవ్ : ‘ప్రతిరోజూ పండగే’ విజయోత్సవం

తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో పండగ జరుగుతోంది. పడి పడి నవ్వుకుంటున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలని కాస్త ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. మారుతి దర్శకత్వంలో సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పండగ సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది. సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

ఈ నేపథ్యంలో పండగ చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. తాజాగా పండగ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో ఘనంగా జరుగుతోంది. పండగ చిత్రబృందం మొత్తం రాజమండ్రిలో వాలిపోయింది. రాజమండ్రిలో ఆనంకళాకేంద్రంలో జరుగుతున్న పండగ వియోత్సవ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !