సందీప్ వంగాతో ప్రభాస్ బాలీవుడ్ సినిమా

బాహుబలి సినిమాతో బాలీవుడ్ లోనూ ప్రభాస్ కు క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’పై మిక్సిడ్ టాక్ వచ్చినా.. బాలీవుడ్ లో రూ. 150కోట్లపైగా వసూలు చేసింది. ప్రభాస్ తో బాలీవుడ్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకొన్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. హిట్టుతో పాటు విమర్శలని ఎదుర్కొన్నారు.

సందీప్ వంగా తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండాల్సి ఉంది. కానీ, బాలీవుడ్ లో కబీర్ సింగ్  తెచ్చిన క్రేజ్ తో అక్కడే మరో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. డార్క్ క్రైమ్ సబెక్ట్ ని రాసుకొన్నాడు. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కి వినిపించాడు. ఆయనకి కథ నచ్చింది. ఓకే చెప్పేశారు. కానీ, ఇప్పుడీ సినిమా నుంచి రణ్ బీర్ తప్పుకొన్నారు.

దీంతో.. ఇటీవల సందీప్ వంగా ప్రభాస్ ని కలిసి కథ చెప్పాడు. రణ్ బీర్ తో అనుకొన్న సినిమా ప్రభాస్ తో తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. సాహో తర్వాత ఓ మంచి కథ కోసం వెతుకుతున్న ప్రభాస్ ని సందీప్ సంతృప్తి పరిచినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతుంది.