బ్రేకింగ్ : ఏపీ రాజధానిపై నిర్ణయం వాయిదా

మరికొద్దిసేపట్లో ఏపీ క్యాబినేట్ సమావేశం కానుంది. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై చర్చించనుంది. ఏపీ క్యాబినేట్ పై స్పష్టమైన ప్రకటన చేయనుంది. విశాఖని ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించనున్నారు. ఆ వెంటనే అంటే.. రేపటి నుంచే దానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ, తాజా క్యాబినేట్ భేటీలో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం రాకపోవచ్చని సమాచారమ్.

నేటి క్యాబినేట్ అజెండాలో రాజధాని అంశం మాత్రమే కాదు చాలా అంశాలున్నాయి. అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ తదితర అంశాలపై చర్చించనున్నారు. దాంతోపాటు జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై చర్చించనున్నారు. ఐతే, రాజధానిపై ఇంకో కమిటీ నివేదిక రావాల్సింది. అదే బోస్టన్ కన్సెంటింగ్ రిపోర్ట్. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరోసారి కేబినేట్ భేటీ జరగనుంది. అప్పుడు ఏపీ రాజధాని విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.