పరశురామ్ ఈజ్ సూపర్ బ్యాక్ 

‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. గీత గోవిందం ఏకంగా రూ.100కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో పరశురామ్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. పరశురామ్ కూడా మహేష్ ని శాయాశక్తుల ప్రయత్నించారు. ఫైనల్ గా విఫలమయ్యాడు. దాంతో తిరిగి నాగ చైతన్యతో సినిమా మొదలెట్టాడు అనే చెప్పుకొన్నారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? మహేష్ తో పరశురామ్ సినిమా ఉండనుంది.

ఈ విషయాన్ని స్వయంగా పరశురామ్ నే ప్రకటించారు. మహేష్ తో నా సినిమా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వంశీపైడిపల్లితో మహెష్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహెష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈలోపు పరశురామ్ నాగ చైతన్య సినిమాని పూర్తి చేయనున్నాడు. పరశురామ్ ప్రభాస్ కి కూడా కథని చెప్పాడు. ఆయన ఏమన్నారు ? అన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి.. మహేష్ తో సినిమా చేయాలన్నది పరశురామ్ కోరిక కాస్త ఆలస్యమైనా తీరబోతుంది.