బ్రేకింగ్ : అమరావతిలో మీడియాపై దాడి

ఏపీలో రాజధాని రైతులు రెచ్చిపోయారు. ఏకంగా మీడియాపై దాడి చేశారు. కొద్దిసేపటి క్రితమే అమరావతిలో కేబినేట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తల నేపథ్యంలో.. తమకి అనుకూలంగానే నిర్ణయం తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు.. ఉద్దండయునిపాలెంలో కారులో వెళ్తున్న మీడియా ప్రతినిధులపై రైతులు దాడి చేశారు. దాంతో కారులో కూర్చొన్న మీడియా ప్రతినిధులకి స్వల్ప గాయాలయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఐతే, వారిని ఫిర్యాదు చేయకుండా రైతులు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితి నెలకొంది.

ఇక ఈరోజు కేబినేట్ భేటీలోనూ రాజధాని అంశంపై చర్చిస్తారు. కానీ, స్పష్టమైన నిర్ణయం ఈరోజే రాకపోవచ్చని చెబుతున్నారు. రాజధానిపై మరో కమిటీ రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వచ్చాకే రాజధానిపై స్పష్టమైన ప్రకటన ఉండచ్చని చెబుతున్నారు.