విశాఖలో సీఎం జగన్ కి ఘన స్వాగతం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేసిన జగన్ ఆ తర్వాత వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆర్కేబీచ్‌ వద్ద విశాఖ ఉత్సవ్‌‌ కు చేరుకుంటున్నారు. సీఎం జగన్ సమయంలో రోడ్డుకి ఓ వైపు మానవహారంలా నిలబడిన జనాలు అభివాదం తెలిపారు.

థ్యాంక్స్ సీఎం జగన్ అంటూ ఫ్లకార్డులు ప్రదరించారు. ఇక విశాఖని ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ని చూసేందుకు ఈస్ట్, వెస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక విశాఖ ఉత్సవ్ లో సీఎం జగన్ విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.