ఈ ఒక్క పిక్ చాలు

ఈ ఒక్క పిక్ చాలు అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. దానికి సంబంధించిన సాంగ్ ప్రోమోని మరికొద్దిసేపట్లో రిలీజ్ చేయనున్నారు. అంతకంటే ముందే.. ఓ పిక్ ని వదిలింది.

ఈ పిక్ లో మహేష్, మిల్కీబ్యూటీ డ్యాన్స్ మూడ్ లో ఉన్నారు. ఆ పిక్ అదిరిపోయింది. మహేష్-మిల్కీ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరినట్టు ఈ సింగిల్ పిక్ తో అర్థమవుతోంది. #DaangDaang సాంగ్ లో మహేష్ తో తమన్నా మెరవనుంది. అందం, అభినయంలో మహేష్ కి తమన్నా సరిజోడు అంటున్నారు. ఈ ఒక్క సాంగ్ తో మెయిన్ హీరోయిన్ రస్మిక క్రేజ్ ని తమన్నా కొట్టేసేలా కనిపిస్తోంది. అన్నట్టు.. ఈ ఒక్క సాంగ్ కోసం తమన్నా ఏకంగా రూ. 40లక్షలు తీసుకుందట. ఇక హీరోయిన్ గా చేసిన రస్మిక రూ. 80లక్షలు తీసుకుందని తెలుస్తోంది.