క్షమాపణలు చెప్పిన రాజశేఖర్ 

‘మా’ నూత సంవత్సర డైరీ ఆవిష్కరణ సభలో నటుడు రాజశేఖర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మాటని ఖాతారు చేయలేదు. వివాదాలని ప్రస్తావించవద్దని మెగాస్టార్ చెప్పిన వెంటనే.. మాలో విబేధాలున్నాయి. గొడవలు జరుగుతున్నాయి. దానికంతంటికి అధ్యక్షుడు నరేష్ నే కారణమని ఫైర్ అయ్యాడు. మధ్యలో వారించబోయిన మోహన్ బాబుని ఉద్దేశింది.. మోహన్ బాబు గారు గట్టిగా అరిస్తే.. ఇక్కడ ఏమీ ఆగిపోవని అన్నారు. దీంతో.. అందరు అవక్కాయారు.
 
ఆ తర్వాత భర్త చేసిన పనికి భార్య జీవిత రాజశేఖర్ క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ కొద్దిసేపటికే మా ఉపాధ్యక్షపదవి రాజీనామా చేస్తున్నట్టు రాజశేఖర్ ప్రకటించారు. అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా చిరు, మోహన్ బాబులకి క్షమాపణలు చెప్పారు. రోజు ఏం జరిగినా అది నాకూ, నరేశ్ కు,మాకు మధ్య మాత్రమే జరిగింది. అతడు ఏ ఒక్క పనీ సరిగ్గా జరగడం లేదు. అందుకే నేను మాట్లాడకుండా ఉండలేకపోయా. నాకూ చిరంజీవిగారికి, మోహన్ బాబుగారికి మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవు. నా వల్ల ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. మా కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశానని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.