డర్టీ సినిమా చేస్తున్న ఎంఎస్ రాజు

ఎంఎస్ రాజు.. ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన నిర్మాత. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలని నిర్మించారు. ఇప్పుడీ నిర్మాత దర్శకుడుగా మారాడు. ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రానికి ‘డర్టీ హరి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

టైటిల్ లో డర్టీ ఉన్నా.. సినిమా అందంగా మరియు కవితాత్మకంగా యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని ఎంఎస్ రాజు తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు  ఉదయం 11.11ని.లకి విడుదల చేయనున్నారు.

ఫస్ట్ లుక్ తోనే హీరో-హీరోయిన్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రాన్ని గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేషన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు. మరీ.. టెస్ట్ ఉన్న నిర్మాతగా పేరుతెచ్చుకున్న ఎంఎస్ రాజు.. దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతారా.. ? చూడాలి.