ఇరాక్ లో మరోసారి కాల్పులు

ఇరాన్‌ ఉన్నత స్థాయి కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీపై శుక్రవారం జరిపిన దాడిలో హషీద్‌ అల్‌ షాబీ డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌ ముహందిస్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే దళానికి చెందిన ‘హషీద్‌ అల్‌ షాబీ’ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి.

తాజా దాడులకి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ ఇరాక్‌ మీడియా మాత్రం అమెరికా దాడులుగానే పేర్కొంటోంది.మరోవైపు శుక్రవారం నాటి దాడుల్లో మరణించిన ‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ కమాండోలు, ‘హషీద్ అల్‌ షాబీ’ దళ సభ్యులకు ఇరాక్‌లోని ఇరాన్‌ మద్దతుదారులు నేడు సంతాపయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం మృతదేహాల్ని ఇరాన్‌కు అప్పగించనున్నారు.