హైదరాబాద్’లో రోహిత్ శర్మ పేరిట క్రికెట్ స్టేడియం

హైదరాబాద్ శివార్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేరిట క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, అతడి భార్య రితిక కూడా పాల్గొన్నారు.

త్వరలోనే ఈ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని  మిషన్ మార్గదర్శకుడు కమలేష్  పటేల్ తెలిపారు. రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే స్టేడియానికి అతడి పేరు పెడుతున్నామని తెలిపారు. తన సహచరులని ఇక్కడికి తీసుకొస్తామని రోహిత్ శర్మ తెలిపారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్టేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు.