జగన్ సర్కార్ నవ్వుల పాలైంది

సీఎం జగన్ ప్రభుత్వం నవ్వుల పాలైందన్నారు సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. నారాయణ మొదటి నుంచి ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిని తరలించాలంటే సీఎం జగన్ రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన నారాయణ మరోసారి అదే డిమాండ్ చేశారు.

అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడినట్లైతే ఆయన చర్యలు తీసుకొండి. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ భార్యభర్తల సంబందం లాంటిదని వీడదీయకూడదు నారయణ అన్నారు. ఆంధ్రప్రేదేశ్‌ ప్రభుత్వం అంటే నవ్వుల పాయిందని విమర్శించారు. చంద్రబాబుపై కక్షతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికదాని హితవు పలికారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ రాష్ట్రాన్ని మూడుముక్కలాడుతున్నాడని దుయ్యబట్టారు.