తెలంగాణ సేవలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తెలంగాణ సేవలో ఉన్నారని ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. అంతేకాదు.. టీఆర్ఎస్ నేతలు సీఎం జగన్ కి కలిసి థ్యాంక్స్ చెబుతున్నారని నారాయణ అన్నారు. ఎందుకంటే.. ? ఏపీకి మూడు రాజధానుల ప్రకటనతో తెలంగాణకి లాభం కలుగుతోంది. తెలంగాణలో రియల్ వెంచర్లు పెరిగాయ్. దీంతో టీఆర్ఎస్ నేతలు హ్యాపీగా ఉన్నారు. సీఎం జగన్ తెలంగాణ సేవలో ఉన్నారని.. ఏపీ రాజధాని అంశాన్ని తెలివిగా తెలంగాణకి లింకు పెట్టాడు నారాయణ.

అక్కడితో ఆగలేదు నారాయణ.. సీఎం జగన్ కి దమ్ముంటే రాజధాని అజెండాగా మళ్లీ ఎన్నికల వెళ్లాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తో పాటు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆయన సవాల్ చేశారు. అభివృద్ది వికేంద్రీకరణ అన్నది వామపక్ష పార్టీల నినాదం. కానీ సీపీఐ నారాయణ మాత్రం తెదేపా,జనసేన ల కంటే ఎక్కువగా ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. బహుశా.. అమరావతిలో నారాయణకి భూమి ఉందంటారా.. !!