మెగాసూపర్ ఈవెంట్’కు ఏర్పాట్లు పూర్తి


హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం మెగా సూపర్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సాయంత్రం ఎల్భీ స్టేడియంలో జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే ఎల్బీ నగర్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్స్ ఆకట్టుకుంటున్నాయ్. ఓ వైపు భారీ మెగా, మరోవైపు భారీ సూపర్ స్టార్ కటౌట్స్ ని ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్ కి వచ్చే దారిపొడవునా.. సరిలేరు, మహేష్, చిరు బ్యానర్లు, కటౌట్స్  వెలిశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎల్భీ స్టేడియానికి కళొచ్చింది. రాత్రి మెగా సూపర్ స్టార్స్, వారి అభిమానులతో కళకళాడనుంది.