తీహార్ జైలుకు చంద్రబాబు

తెదేపా చంద్రబాబు వెళ్తానంటే.. తీహార్ జైలు ఖాళీగానే ఉందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. సాధారణంగా స్పీకర్ రాజకీయ ఆరోపణలకి దూరంగా ఉంటారు. కానీ, అందుకు భిన్నంగా తమ్మినేని వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా మరోసారి స్పీకర్ తమ్మినేని తెదేపా అధినేత చంద్రబాబుపై సైటైర్లు వేశారు. అవసరమైతే జైలుకు వెళ్తానంటున్న చంద్రబాబును ఆపబోమని, తీహార్ జైలు ఖాళీగానే ఉందని అన్నారు తమ్మినేని.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే దమ్ము ఉండాలని తమ్మినేని అన్నారు. విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా ? కాదా ? అని ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ నివేదికను తప్పుబడుతున్న చంద్రబాబుకు అందరి మాటలు అబద్ధాలుగానే వినిపిస్తాయని విమర్శించారు. చంద్రబాబు పనైపోయిందని ఘూటు వ్యాఖ్యలు చేశారు.