చిరు రొమాంటిక్ స్పీచ్


ఆదివారం సరికొత్త మెగాస్టార్ కనిపించారు. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగం ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగింది. ఫనీగా మొదలెట్టిన మెగాస్టార్ రొమాంటిక్ గా ముగించారు. స్టేజ్ పై ఎవ్వరినీ వదల్లేదు. అందరిపై సటైర్స్ వేశారు.

మహేష్ కి కూడా వదల్లేదు. మహేష్ చూడగానే ముద్దొస్తాడు. బిడ్డలా కనిపిస్తాడు. ఆయన మొహంపై ఎప్పుడూ చిరునవ్వు కనిపిస్తుంది.ఆ చిరు నవ్వు వెనకాల చిలిపితనం కూడా ఉంటుంది. దొంగ అంటూ.. నవ్వులు పూయించారు. ఇక హీరోయిన్స్ అయితే ఓ ఆటాడుకొన్నాడు. రష్మిక మందన తనని కాంట్రాక్ట్ తీసుకున్నట్టుంది. ఆమె నటించిన ప్రతి సినిమాకి తనని రప్పిస్తుందన్నారు.

నా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. మంచి నటి. ఆమె చిన్న పాత్రైనా చేస్తుంది. బొమ్మలా ఉంటుందంటూ ప్రశంసించారు. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని ఓ ఆటాడుకున్నాడు చిరు. ఆమెతో జ్ఝాపకాలని గుర్తు చేసుకొన్నాడు. గతంలో తనపై చేసిన విమర్శలపై నిలదీశాడు. ఆఖరికి అక్కున చేర్చుకున్నాడు. రాజకీయాలు దూరం పెంచుతాయి. సినిమాలు దగ్గర చేస్తాయంటూ.. మేం మళ్లీ కలిసిపోయామన్నారు. మొత్తానికి చిరు ప్రశంగం రొమాంటిక్ గా సాగిందని చెప్పవచ్చు.