బీజేపీలోకి మోహన్ బాబు ఫ్యామిలీ


సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. మోహన్ బాబు, ఆయన కూతురు లక్ష్మీ మంచు, పెద్ద కొడుకు మంచు విష్ణు దంపతులు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలని మోహన్ బాబు, విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధానిని కలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. దక్షిణాది నటీనటులు ప్రధానితో భేటీ కావాలని ఉందని ప్రధాని అడిగానని.. అందుకు ఆయన ఓకే చెప్పారని.. బహుశా.. త్వరలోనే ప్రధాని కార్యాలయం నుంచి దక్షిణాది నటీనటులకి పిలుపు రావొచ్చని విష్ణు ట్విట్ చేశారు.

ఇక మోహన్ బాబు ఫ్యామిలీని బీజేపీలో చేరాలని ప్రధాని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఆయన వైసీపీలో చేరారు. మోహన్ బాబు ఫ్యామిలీకి సీఎం జగన్ బంధువు కూడా. ఈ నేపథ్యంలో త్వరలోనే మోహన్ బాబుకి పెద్ద పదవి దక్కనుంది. ఆయన్ని రాజసభకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచార జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీ ప్రధానిని కలవడతో.. వీరు బీజేపీ వైపు చూస్తున్నారా.. ? అనే చర్చ మొదలైంది.