జైలులో ఉన్న రైతులని పరామర్శించిన లోకేష్

తెదేపా యువనేత నారా లోకేష్ గుంటూరు జైలులో ఉన్న రైతులని పరామర్శించారు.  మీడియాపై దాడి చేసిన రైతులు, ఆందోళనలోఅరెస్టయిన మరికొందరు రైతులు గుంటూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. తాజాగా నారా లోకేష్ మరికొందరు తెదేపా నేతలు గుంటూరు జైలుకెళ్లి రైతులని పరామర్శించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. “ఫేక్ రిపోర్టులతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు కాదు.. మూడు ముక్కలాట చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరగదు. జిరాక్స్ షాప్స్ వస్తాయి అంతే. జైలులో ఉన్న రైతులు ధైర్యంగా ఉన్నారు. బయటికొచ్చాక.. మళ్లీ శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని చెప్పారు’ అని లోకేష్ అన్నారు.