సరిలేరు టాక్ లీకు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్, రష్మిక జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజే టైం ఉంది.రేపు సాయంత్రం నుండే యూఎస్ లో ప్రీమియర్స్ హడావిడి మొదలై సినిమా టాక్ బయటికొచ్చేస్తుంది.అంతకంటే ముందే సినిమా టాక్ బయటికి రావడం విశేషం. అదేలా ? అన్నది తెలీదు. కానీ.. సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని చెబుతున్నారు.

అయితే ఈ సినిమాలో కామెడీ సీన్స్ బాగున్నప్పటికి రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒక్కటే సరిలేరు నీకెవ్వరు సినిమాకు మైనస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు. విజయశాంతి సరిలేరు కథకు ఆయువు పట్టునిస్తుందని,  విజయశాంతి కోసమే మహేష్ ఆర్మీ నుంచి సమాజంలోకి వస్తాడని.. ఇంకా ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే విలన్‌గా రాణించాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహెష్ సంయుక్తంగా నిర్మించారు.