పొలిటికల్ ఎంట్రీపై నిర్భయ తల్లి స్పందన

నిర్భయ తల్లి ఆశాదేవి రాజకీయాల్లోకి రానున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆమెని సంప్రదించారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారంపై ఆశాదేవి స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. తనను కాంగ్రెస్ సహా మరే పార్టీ నేతలు సంప్రదించలేదన్నారు. తన కుమార్తెకు న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే పోరాడుతున్నాను. కానీ, మరో ఉద్దేశం లేదు. ఇలాంటి ప్రచారం ఎలా పుట్టుకొస్తాయో అర్థంకావడం లేదన్నారు. మరోవైపు, నిర్భయ నిందితులకి ఉరిశిక్ష ఖరారైంది. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షని అమలు చేయనున్నారు.