సీఎం జగన్ వార్నింగ్ : తెదేపాకి మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే

సీఎం జగన్ తెదేపాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 23మంది ఎమ్మెల్యేల్లో తెదేపాకి మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే అన్నారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా మాట్లాడిన సీఎం జగన్.. తెదేపా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకంగా తెదేపా అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తెదేపా ఎమ్మెల్యేలు మూర్ఖులు, క్రూరులు అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు.. సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలని మార్షల్స్ ని పిలిపించి బయటపడేయండని అన్నారు. తెదేపా వైఖరి ఇలానే ఉంటే.. 23 ఎమ్మెల్యేలో ఆ పార్టీకి మిగిలేది ఇద్దరు మాత్రమే అన్నారు. ఆ ఇద్దరిలో చంద్రబాబు ఒక్కరు. మరొకరు ఎవరు ? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి.. అసెంబ్లీ సాక్షిగా త్వరలో తెదేపా ఖాళీ కాబోతుందని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు భావించవచ్చేమో !