రాజధాని రైతులపై సీఎం జగన్ వరాల జల్లు

రాజధాని రైతులపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. వైసీపీ అధికారంలో ఉన్నంతవరకు అమరావతి రైతులకి అన్యాయం జరగదని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అమరావతి అన్నీ రకాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 29 గ్రామాల్లోని పేద రైతులకి రూ. 5వేల భృతిని ఇస్తామన్నారు.

రాజధాని మారుస్తున్నారన్న ప్రచారాన్ని సీఎం జగన్ ఖండించారు. అసలు రాజధానిని మార్చడం లేదని.. అమరావతి ఓ రాజధానిగా ఉంచుతూనే మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.