సప్రైజ్ : అనుష్క కోసం పాట పాడిన విరాట్

విరాట్‌ కోహ్లీ – అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, పెళ్లి వేడుకకి సంబంధించిన ఓ వీడియో బయటికొచ్చింది. కోహ్లీ తన సతీమణి కోసం ‘మేరే మెహబూబ్‌.. ” అనే రొమాంటిక్‌ పాట పాడాడు. పెళ్లి రోజు రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కోహ్లీ పాడిన పాట ఇది. సతీమణి కోసం కోహ్లీ పాడిన తొలి పాట ఇది. ముందు ముందు మరిన్ని పాటలు శ్రీమతి కోసం పాడతాడనుకోండీ.. !