ఎంపీ గల్లా జయదేవ్’ని పోలీసులు హింసించారా.. ?

అసెంబ్లీ ముట్టడి సందర్భంగా తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బెయిల్ పై గుంటూరు సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్ పోలీసుల వైఖరిని తీవ్రంగా హింసించారు. ఇంకా చెప్పాలంటే పోలీసులు ఓ రేంజ్ లో హింసించారని.. చొక్కా విప్పి మరీ గోర్ల ఘాట్లని చూపించారు.

అదుపులోకి తీసుకున్న 15 గంటలపాటు వ్యాన్ లో తిప్పారు. నరసరావుపేట పీఎస్ లోనే మూడు గంటల పాటు ఉంచారు. స్టేషన్ బయట జనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రొంపిచెర్ల తీసుకెళ్లారు. అక్కడ మరో రెండు గంటలు ఉంచారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. జనాలు భారీగా వస్తుండడంతో మళ్లీ అక్కడి నుంచి తరలించి గుంటూరు జిల్లా అంతా సైట్ సీయింగ్ చూపించారు. కాకాని వద్ద మరో నాలుగు గంటలు ఆపేశారు. ఉదయం 11 గంటల నుంచి మొదలుపెడితే 15 గంటలు పట్టింది.
 
ఇటీవల అరెస్టయిన రాజధాని మహిళలు తమను పోలీసులు గిచ్చుతున్నారని చెబితే ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడర్థమైంది… మామూలుగా గిచ్చడం కాదు, పుండ్లు పడేట్టు గిచ్చుతున్నారు. ఇలా చేస్తోంది పోలీసులు కాదు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో చేయిస్తున్నారు. వాళ్లు కేంద్ర బలగాలకు చెందినవాళ్లు కాబట్టి వారిపై యాక్షన్ తీసుకోలేమని చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆయన ఒంటిపై ఉన్న ఘాట్లని చూస్తే మాత్రం.. పోలీసులు బాగానే టార్చర్ పెట్టినట్టు అర్థమవుతోంది.