న్యూజిలాండ్’కు బయలుదేరిన టీమిండియా

టీమిండియా న్యూజిలాండ్ కి బయలుదేరి వెళ్లింది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగనున్న న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడనుంది. ఈ సిరీస్ కి గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ధావన్ తో పాటు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గాయం కారణంగా న్యూజిలాండ్ పర్యటనకి దూరమయ్యాడు.

స్వదేశంలో అదరగొడుతున్న న్యూజిలాండ్ సిరీస్ పెద్ద ఛాలెంజ్ కానుంది. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకి ఈ సిరీస్ ఓ అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ? ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ రాణిస్తే.. న్యూజిలాండ్ లో ఆ జట్టుని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు.