మహేష్ ఫ్యామిలీ ట్రిప్.. ఈసారి ఎక్కడికో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఓ సినిమా పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ కి వెళొస్తుంటారు. సంక్రాంతి పండగక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా ప్రమోషన్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ కలిసి న్యూ యార్క్ చెక్కేశారు.

ఫ్లైట్ ఎక్కేముందు ఫ్యామిలీ కలిసి ఫోటోలకి పోజులిచ్చాడు. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్ ట్రిప్ సుదీర్ఘంగా సాగనుంది తెలుస్తోంది. వాటికి సంబంధించిన అప్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు మరీ.. !

ఇక సరిలేరు నీకెవ్వరు పదిరోజుల్లో రూ. 101.97కోట్ల షేర్ ని వసూలు చేసింది. నైజాంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ హిట్ తో సరిలేరు చిత్రబృందం హ్యాపీ మూడులో ఉంది. మహేష్ నుంచి చాన్నాళ్ల తర్వాత వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ని మహెష్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. సో.. మహేష్ హ్యాపీ, ఆయన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. మొత్తానికి.. ఆల్ హ్యాపీస్.. !!