మాముళ్లు వసూలు చేస్తున్న తెరాస ఎమ్మెల్యే కొడుకు

పటాన్ చెరువు తెరాస ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్థన్ మాముళ్ల వసూలుకి పాల్పడటం హాట్ టాపిక్ గా మారింది. చిరు వ్యాపారుల నుంచి విష్ణువర్థన్ డబ్బులు అడగడం, మాముళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. వారంతా పోలీస్ స్టేషన్ కి వచ్చి విష్ణువర్థన్ పై డిమాండ్ చేశారు. విష్ణువర్థన్ రెడ్డి మద్యంతాగి వచ్చి బెదిరింపులకి పాల్పడుతున్నారని.. మాముళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో.. పటాన్ చెరువులో తెరాస పరువుపోయినట్టయింది.

ఈ ఘటనని తెరాస శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి  మంచి పేరుంది. ఆ పేరుని చెడగొట్టేలా ఆయన తనయుడు విష్ణువర్థన్ తీరు ఉండటం గమనార్హం. ఐతే మద్యమత్తులో విష్ణువర్థన్ చేసిన పని పటాన్ చెరువులో తెరాస ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉంది. ఇకపైనైనా మహిపాల్ రెడ్డి.. తనయుడు విష్ణువర్థన్ ని హద్దు అదుపులో పెట్టుకుంటే మంచిదేమో.. !