మహేష్’ని వేధిస్తున్న ‘ఆగడు’ గాయాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలిపోయింది ‘ఆగడు’ సినిమా. మహేష్ కి ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు సినిమా వచ్చింది. 2014లో వచ్చిన ఆగడు అట్టర్ ప్లాప్ అయింది. ఐతే, ఈ సినిమా గాయాలు మహేష్ ని ఇప్పటికీ వెంటాడుతున్నాయట. ఆగడు సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కాలికి గాయమైంది. ఆ గాయాన్ని అప్పట్లో మహేష్ సీరియస్ గా తీసుకోదట. ఇప్పుడా గాయం తిరగడిందని సమాచారమ్.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఫ్యామిలీ కలిసి న్యూ యార్క్ లో విహరిస్తున్న మహేష్ అక్కడి నుంచి అమెరికాకి వెళ్తారని తెలుస్తోంది. అక్కడ మోకాలికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడట. మూడు నెలల పాటు అక్కడే రెస్ట్ తీసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. చికిత్స నుంచి కోలుకున్నాక వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని చెబుతున్నారు. సమ్మర్ లో మహేష్-వంశీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

మహర్షి తర్వాత మహేష్-వంశీ కాంబోలో రాబోతున్న సినిమా ఇది. మహేష్ కోసం వంశీ జేమ్స్ బాండ్ కథ రెడీ చేశాడని చెబుతున్నారు. ఒకరకంగా ఇది మహేష్ కలల చిత్రం. జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని గతంలో పలుమార్లు మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తరహా కథలు పలువురు దర్శకులు మహేష్ వద్దకి తీసుకొచ్చినా.. ఆయన రిజెక్ట్ చేశారు. ఫైనల్ గా మహేష్ కి బాగా నచ్చిన వంశీ ఆయన కోసం ఓ జేమ్స్ బాండ్ కథని రెడీ చేశారని తెలుస్తోంది.