వైకాపాలో చేరబోతున్న హీరో సుమన్

సీనియర్ హీరో సుమన్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కణ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుందనే కోరికని బయటపెట్టారు. అవకాశం ఇస్తే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించించారు.
 
అంతేకాదు.. గతంలో ఐదు సార్లు సీఎం ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించానని.. కానీ అవకాశం లభించలేదని తెలిపారు. రాజధాని రైతుల సమస్యలని పరిష్కరించాలని సుమన్ డిమాండ్ చేశారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజమే. యువకుడైన కొత్త సీఎం జగన్ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారని ప్రశంసించారు. సుమన్ మాట తీరు చూస్తుంటే.. ఆయన వైకాపాలో చేరేందుకు ఆసక్తిని చూపించినట్టు అర్థమవుతోంది. ఇక రావాల్సింది సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ నే. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం సీనియర్ హీరో సుమన్ ఫ్యాన్ గాలికింద వాలిపోనున్నారు.