ఎల్లుండి ప్రకాష్ రాజ్’ని చంపేస్తాం

నటుడు ప్రకాష్ రాజుని ఎల్లుండిని చంపేస్తామనే బెదిరింపు వచ్చాయి. ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి లతోపాటు మరో 13 మందిని హత్య చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తూ వస్తున్న నిజగుణానందస్వామికి వచ్చిన ఆ లేఖలో వీరి పేర్లున్నాయి. 

ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాం. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. నిజగుణానందస్వామీ! మీరు ఒక్కరే కాదు. దిగువ ఉన్న పేర్లను చూడండి అంటూ కన్నడలో ఉన్న లేఖ అందింది. ఈ లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి ఆశ్రమవాసులు అందజేశారు. కాగా శనివారం తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కుమార స్వామి వరుస ట్విట్స్ చేసిన సంగతి తెలిసిందే.