బాలీవుడ్ కొరియోగ్రాఫ్’పై #మీటూ ఆరోపణలు

జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ కొరియోగ్రాఫ్ గణేష్ ఆచార్య చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఓ మహిళా లైంగిక ఆరోపణలు చేసింది. గ‌ణేష్ ఆచార్య త‌న‌ని మాన‌సికంగా, శారీరికంగా వేధిస్తున్న‌ట్టు గ‌ణేష్ ఆచార్య‌పై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేష‌న్‌తో పాటు, మ‌హారాష్ట్ర ఉమెన్స్ క‌మీష‌న్‌లో ఫిర్యాదు చేసింది. త‌న‌కి వ‌చ్చే ఆదాయంలో క‌మీష‌న్‌తో పాటు అడ‌ల్ట్ వీడియోస్ చూడాలని బ‌ల‌వంత పెడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. 

గ‌ణేష్ ఆచార్య 2018లో బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ పొందిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ‘టాయ్‌లెట్ ఎక్ ప్రేమ్ క‌థా’ చిత్రంలో “గోరీ తు ల‌త్ మార్.. ” అనే సాంగ్‌కి గానూ జాతీయ అవార్డుని అందుకున్నారు. సింబా, జీరో, ప‌ద్మావ‌త్‌, సంజు, జుడ్వా2  వంటి చిత్రాల‌లో ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి అద్భుత‌మైన కొరియోగ్ర‌ఫీ అందించాడు.
గతంలోనూ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనూశ్రీ దత్తా భారతదేశంలో #మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపనలు చేసింది. ఆయనతో పాటు గణేష్ ఆచార్యపై ఆమె ఆరోపణలు చేసింది. గ‌ణేష్  “హానికరమైన పుకార్లు” వ్యాప్తి చేయ‌డంతో పాటు,  వృత్తిపరమైన ప్రతిష్టను నాశనం చేశాడని తనుశ్రీ ఆరోపించింది.