మణిరత్నం మల్టీస్టారర్ లో త్రిష పాత్ర ఇదే.. !

సీనియర్ హీరోయిన్ త్రిష హవా ఏమాత్రం తగ్గలేదు. ఆమె చేతిలో అరడజనుకిపైగా సినిమాలున్నాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో మణిరత్నం మల్టీస్టారర్ లో మెరవనుంది.

 మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇందులో కార్తికి జంటగా త్రిష నటించనున్నారు. ఇందులో కార్తి ‘వందియదేవన్‌’ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జంటగా త్రిష ‘కుందవై’లో నటిస్తున్నట్లు సమాచారమ్. ఇదిలా ఉండగా పళవేట్టరయార్‌ పాత్రను శరత్‌కుమార్, నందిని పాత్రను ఐశ్వర్యరాయ్, రాజరాజ చోళన్‌ పాత్రను జయం రవి పోషించనున్నట్లు తెలిసింది.