శర్వానంద్’తో ‘దండుపాళ్యం’ !

యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలు చేసుకొంటు వెళ్తున్నాడు. ఈ దారిలో ఆయన మరో విభిన్నమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారమ్. ‘దండుపాళ్యం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు శ్రీ‌నివాస‌రాజు. ఇటీవ‌లే శ‌ర్వాని క‌ల‌సి ఒక క‌థ వినిపించాడు. అది విభిన్నమైన కథ కావడంతో శర్వా వెంటనే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వా హను రాఘవపూడి, సుధీర్ వర్మ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత దండుపాళ్యం సినిమా దర్శకుడి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ఈ యేదాది ఇప్పటికే శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో హిట్స్ కొట్టాడు శర్వా. స్టార్ హీరోల సినిమాలకి కూడా సాధ్యం కానీ రేంజ్ లో ఈ యంగ్ హీరో విజయాలు అందుకోవడం ఇండస్ట్రీకి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలావుండాగా, దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న నితిన్ ‘శ్రీనివాసకళ్యాణం’ సినిమాలో శర్వా కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.