రణ్ బీర్’తో వందసార్లు చేశా


పూజా హెగ్డే.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ స్థాయికి రావడానికి ఆమె బాగానే కష్టపడింది. ‘ముకుందా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పూజా హెగ్డే. అదే సమయంలో బాలీవుడ్ లోనూ ప్రయత్నాలు చేసింది. అవి ఫలించి అక్కడ సినిమాలు చేసింది. హృతిక్ రోషన్ తో కలిసి ‘మెహంజదారో’ సినిమా చేసినా. ఆశించిన స్థాయిలో ఆడలేదు. అల్లుఅర్జున్ ‘డీజే’ సినిమాతో పూజా దశ తిరిగింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్, మహేష్ బాబులతో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఐతే, కెరీర్ స్టార్టింగ్ లో బాలీవుడ్ లో కొన్ని యాడ్ ఫిల్స్ కూడా చేసింది పూజా. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తోనూ ఓ యాడ్ ఫిల్మ్ చేసింది. ఆ సమయంలో రణ్ బీర్ కి వందసార్లు సారీ చెప్పిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాకు ఇప్పటివరకు ఎవరికైనా సారీ చెప్పే పరిస్థితి వచ్చిందా ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి.. రణ్ బీర్ వందసార్లు సారీ చెప్పానని చెప్పింది.

రణ్ బీర్ కపూర్ తో కలిసి ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాను. అప్పటికే రణ్ బీర్ ఓ పెద్ద స్టార్ నాకేమో ఈ రంగం కొత్త. తనని చూడగానే నాకు టెన్షన్ వచ్చేసేది. డైలాగులు ఏమీ గుర్తుండేవి కాదు. దాంతో ఒకే టేక్ చాలాసార్లు తీయాల్సి వచ్చేది. నా కోసం ఒక్కో షాట్ ని మళ్లీ మళ్లీ తీయాల్సిరావడంతో చాలా సమయం వృథా అయ్యింది. అందుకే రణ్ బీర్ కి చాలా సార్లు క్షమాపణ చెప్పా. ఇక నువ్వు సారీ చెప్పొద్దు.. ప్లీజ్ అంటూ రణ్ బీర్ సున్నితంగా మందలించే వరకు సారీ చెప్పానని నవ్వేసింది. రణ్ బీర్ స్నేహశీలి. కొత్తవారిని ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చింది.