బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో సైనా నెహ్వాల్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్నాళ్లు బ్యాడ్మింటన్‌ మైదానంలో సత్తా చాటిన సైనా ఇకపై పొలిటికల్ మైదానంలో రాణించాలని ఆశపడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాని, అందుకే భాజాపాలో చేరానని సైనా తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైనా పాల్గొననున్నారు. సైనా హైదరాబాద్ అమ్మాయి. ఈ నేపథ్యంలో ఆమె చేరికతో తెలంగాణ భాజాపాకి బలం చేకూరినట్టయింది.